గ్రామానికి రోడ్డు సరిగా లేక.. ఆరు కిలోమీటర్లు డోలీలో రోగి తరలింపు

గ్రామానికి రోడ్డు సరిగా లేక..  ఆరు కిలోమీటర్లు డోలీలో రోగి తరలింపు

కరకగూడెం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పద్మాపురం గ్రామ పంచాయతీలోని వలస ఆదివాసీ గ్రామమైన నీలాద్రిపేటకు చెందిన ఓ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు తిప్పలు పడాల్సి వచ్చింది. 

మడివి ఉంగమ్మకు బుధవారం వాంతులు, విరేచనాలు కావడంతో అస్వస్థతకు గురైంది. నీలాద్రిపేటకు 108 వచ్చేందుకు దారి సరిగా లేకపోవడంతో భర్త జోగయ్య గ్రామస్తుల సహకారంతో 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోతె గ్రామం వరకు డోలీ(కావడి) కట్టి తీసుకువచ్చాడు. 108 ద్వారా మణగూరు ఏరియా హాస్పిటల్​కు తరలించారు.