జనక్​ ప్రసాద్​కు సన్మానం

జనక్​ ప్రసాద్​కు సన్మానం

కోల్​బెల్ట్/నస్పూర్, వెలుగు: ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, వేజ్ బోర్డు శాశ్వత సభ్యుడు​బి.జనక్ ​ప్రసాద్​ను మినిమమ్​ వేజ్​అడ్వైజరీ బోర్డు చైర్మన్​గా నియమించడంతో ఘనంగా సన్మానించారు. ​ సింగరేణి కార్మికుల పక్షాన పోరాడున్న జనక్​ప్రసాద్​కు రాష్ట్ర సర్కార్ ​ప్రకటించిన కార్పొరేషన్ ​చైర్మన్లలో గుర్తింపు లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన టీపీసీసీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. 1978లో క్లర్క్​గా సింగరేణిలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచె లుగా ఎదిగారు.

ఈ సందర్భంగా జనక్ ​ప్రసాద్​ను ఆదివారం జైపూర్​ మండలం రసూల్ పల్లిలోని ఆయన నివాసంలో బెల్లంపల్లి, రామగుండం రీజియన్ల ఐఎన్టీయూసీ నేతలు ఘనంగా సన్మానించారు. శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల ఐఎన్టీయూసీ వైస్ ​ప్రెసిడెంట్లు శంకర్​రావు, దేవి భూమయ్య, సెంట్రల్​కమిటీ సీనియర్​ వైస్​ప్రెసిడెంట్లు నర్సింహారెడ్డి, సిద్దంశెట్టి రాజమౌళి, ధర్మపురి, కాంపెల్లి సమ్మయ్య, జనరల్​సెక్రటరీ కలవేని శ్యామ్, రాంశెట్టి నరేందర్, బెల్లంపల్లి, రామగుండం రీజియన్ల ఏరియా, గనుల స్థాయి లీడర్లు పూల మాలలు, శాలువాలతో  సన్మానించారు.