రిటైర్​ అయిన నిమ్స్​ ఉద్యోగులకు సన్మానం

రిటైర్​ అయిన నిమ్స్​ ఉద్యోగులకు సన్మానం

పంజాగుట్ట, వెలుగు :  నిమ్స్ హాస్పిటల్​లోని పలువురు ఉద్యోగులు శుక్రవారం పదవీ విరమణ పొందారు. వారిని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప ఘనంగా సన్మానించారు. హాస్పిటల్​లెర్నింగ్​సెంటర్​లో జరిగిన కార్యక్రమంలో బీరప్ప మాట్లాడుతూ.. అంకితభావంతో పనిచేసే ఉద్యోగులు రిటైర్ అయ్యి వెళ్లిపోవడం బాధగా ఉందన్నారు.

పదవీ విరమణ పొందిన వారిలో ఫైనాన్స్​కంట్రోలర్​శ్రీధర్, ల్యాబ్​అసిస్టెంట్ గిరిధర్, ఏసీ మెకానిక్ నాగేశ్వరరావు, సీనియర్​ రేడియోగ్రాఫర్​తిరుపతిరావు, స్టాఫ్​నర్సు తిరుపతమ్మ, ఫార్మాసిస్టు ఉషారాణి ఉన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ డా.శాంతివీర్, డాక్టర్ ఉష, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.