దళితుడిని సీఎం చేయని టీఆర్ఎస్... దళిత బంధు ఇస్తుందా

దళితుడిని సీఎం చేయని టీఆర్ఎస్... దళిత బంధు ఇస్తుందా

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచిన సకల జనుల సమ్మెకు పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా... గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం దగ్గర జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ నేత స్వామి గౌడ్ నివాళులర్పించారు. అమరుల త్యాగాలను ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు కోదండరామ్. దళితుడిని సీఎం చేయని టీఆర్ఎస్... దళిత బంధు ఇస్తుందా అని వెంకటరెడ్డి ప్రశ్నించారు. మిలియన్ మార్చ్, సకలజనుల సమ్మె స్పూర్తితో మరో ఉద్యమం చేస్తామన్నారు నేతలు