వికారాబాద్​ జిల్లాలో.. వీర బాలలకు నివాళి

వికారాబాద్​ జిల్లాలో.. వీర బాలలకు నివాళి

వికారాబాద్​, వెలుగు :  వికారాబాద్​ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో వీర బాలలకు మంగళవారం నివాళులు అర్పించారు.  గురు గోవింద్​సింగ్​కుమారులైన జొరావత్​ సింగ్​, ఫతే సింగ్‌ల బలిదానం డిసెంబర్​26న  సుమారు 500  సంవత్సరాల కిందట జరిగింది.  దీన్ని పురస్కరించుకుని దేశ ప్రధాని పిలుపు మేరకు వీర బాలల దినోత్సవం చేపట్టామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు టి. సదానంద్​రెడ్డి అన్నారు.  

జొరావత్​ సింగ్, ఫతేసింగ్‌ల బలిదానం మరువలేనిదన్నారు.  కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్​ టి. శ్రీదేవి, పట్టణ కార్యదర్శి రఘు, పేట నారాయణరెడ్డి, సాయిబాబా మందిర పూజారి పూరన్​సింగ్, మల్లేశ్ పటేల్, బస్వాలింగం, సతీశ్‌, కిరణ్​, సుధాకర్, లక్ష్మారెడ్డి,  ప్రశాంత్​, మాధూరి, మాధవి, నవీన్​ తదితరులు పాల్గొన్నారు.