
నిజామాబాద్ : పీకల దాకా తాగాడు. ఆ మైకంలో ఆత్మహత్య చేసుకోబోయాడు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెయింటర్ గా పనిచేస్తున్న స్వామి అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తాగిన మత్తులో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూనే… తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటి మీద పోసుకోని నిప్పంటించుకున్నాడు స్వామి. వెంటనే స్పందించిన స్థానికులు… మంటలను అర్పివేశారు. గాయాలైన స్వామిని ట్రీట్ మెంట్ కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు డాక్టర్లు. స్వామి కిందటి సంవత్సరం కూడా… తాగిన మైకంలో అంగడి బజార్ లో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని గుర్తించారు పోలీసులు.