ఇటీవల విడుదలైన ‘యానిమల్’ చిత్రం ఐదు వందల కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళుతోంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రణ్బీర్ కపూర్కి జంటగా రష్మిక మందన్న నటించింది. ఆమెతో పాటు మరో కీలకపాత్ర పోషించిన త్రిప్తి డిమ్రి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తక్కువ నిడివి గల పాత్ర అయినప్పటికీ ఆమెకు ఈ చిత్రం ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. గతంలోనూ తను పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ సినిమాతోనే ఆమెకు క్రేజ్ వచ్చింది.
యూత్ ఆడియన్స్ ఆమెను కొత్త నేషనల్ క్రష్ అంటున్నారు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా వైడ్గా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్గా త్రిప్తిని సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. సౌత్ సినిమాల్లో అవకాశాలు వస్తే కచ్చితంగా చేస్తానని త్రిప్తి కూడా గతంలో చెప్పింది. మరి రవితేజ సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి!