‘యానిమల్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిన త్రిప్తి డిమ్రీ.. ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో మరోసారి నటించబోతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా సందీప్ తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ చిత్రంలో ఆమె హీరోయిన్గా నటిస్తోంది. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. అయితే ఇంతవరకూ హీరోయిన్ త్రిప్తి డిమ్రి షూట్లో జాయిన్ అవలేదు. ఈ నెల 23 నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.
ఈ షెడ్యూల్లో ప్రభాస్తో పాటు త్రిప్తి కూడా పాల్గొనబోతోందని తాజా సమాచారం. వీళ్లిద్దరి కాంబినేషన్లో రొమాంటిక్ సీన్స్ చిత్రీకరించేందుకు దర్శకుడు సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. మల్టిపుల్ షేడ్స్ ఉండే పాత్రలో త్రిప్తి కనిపించనుందట. జూన్ ఫస్ట్ వీక్ వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుందని తెలుస్తోంది. వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య దేశాయ్ విలన్స్గా నటిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. టీ సిరీస్తో కలిసి సందీప్ రెడ్డి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 5న సినిమా రిలీజ్ కానుంది.
