ఈటల గెలిస్తే రాజీనామా చేస్తానన్నఎమ్మెల్యే గువ్వలపై ట్రోలింగ్

ఈటల గెలిస్తే రాజీనామా చేస్తానన్నఎమ్మెల్యే గువ్వలపై ట్రోలింగ్


హైదరాబాద్, వెలుగు: అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు హుజూరాబాద్​ఉప ఎన్నిక తలనొప్పి తెచ్చిపెట్టింది. ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​గెలిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఓ డిబేట్​ సందర్భంలో సవాల్​ చేసిన గువ్వలపై సోషల్​ మీడియాలో ట్రోలింగ్​ మొదలైంది. టీఆర్ఎస్​ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ ఘన విజయం సాధించడంతో గువ్వల మాట మీద నిలబడాలని వివిధ వర్గాలు డిమాండ్ ​చేస్తున్నాయి. గువ్వల బాలరాజు ఎక్కడంటూ వాట్సాప్, ఫేస్​బుక్ లో సెటైర్లు కొనసాగుతుండగా, కొందరు ఆయనకే నేరుగా ఫోన్ ​చేశారు. ఫోన్లు, ట్రోలింగ్​ఎక్కువ కావడంతో గువ్వల ఫోన్​స్విచ్చాఫ్​ పెట్టుకున్నారు. కొందరు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్​ అధికారంలోకి రాకపోతే నాలుక కోసుకుంటానని చెప్పిన సినీనటుడు, నిర్మాత బండ్ల గణేశ్​తో గువ్వల బాలరాజును పోలుస్తూ మీమ్స్​ చేస్తున్నారు.