టీఆర్ఎస్ సర్కారుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. వరంగల్ రింగ్ రోడ్డు పేరుతో టీఆర్ఎస్ మరో లూటీకి శ్రీకారం చుట్టిందని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రియల్ ఎస్టేట్ మాఫియా ద్వారా వరంగల్ రింగ్ రోడ్డు పేరుతో రైతులు సాగు భూములను లాక్కునేందుకు ప్లాన్ వేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇందుకోసం వారు అక్కడి రైతులకు నరకం చూపుతున్నారని విమర్శించారు. ప్లాన్ ప్రకారమే టీఆర్ఎస్ నాయకులు చాలాకాలం క్రితమే ఆ ప్రాంతం చుట్టుపక్కల తక్కువ ధరలకే భూములు సేకరించారని ఆరోపించారు.
TRS has started another loot in the name of Warangal Ring Road (WRR)
— Revanth Reddy (@revanth_anumula) May 11, 2022
KCR & KTR through their real estate mafia are hell bent on grabbing fertile cultivable lands from farmers in the name of WRR.They have amassed huge chunks of lands for cheaper prices in this region long ago.
మరిన్ని వార్తల కోసం..