ఈటల నిర్లక్ష్యం వల్లే వరదలు

ఈటల నిర్లక్ష్యం వల్లే వరదలు

ఈటల నిర్లక్ష్యం వల్లే వరదలు వచ్చి ఇండ్లు మునుగుతున్నాయని ఆరోపించారు పాడి కౌశిక్ రెడ్డి.  వరద బాధితుల పరిస్థితి చూస్తే బాదేస్తుంది.. గుండె బరువెక్కుతుందన్నారు ఎక్కుతుందన్నారు. వరదలతో నష్ట పోయిన పిట్టల వాడ, హౌసింగ్ బోర్డు కాలనీ, అంబేద్కర్, దుర్గా కాలనీ వాసులను ఆదుకుంటామన్నారు. జమ్మికుంట పట్టణంలో నీట మునిగిన హౌసింగ్ బోర్డు కాలనీని సందర్శించారు. వరద నీరు రాకుండా శాశ్వత పరిష్కారం చూపించే బాధ్యత తమదే అన్నారు. వరద బాధితుల దగ్గరకు వచ్చి కూడా.. మురికి నీరు అంట కుండా ఈటల దొర రికం చేస్తున్నారని విమర్శించారు. ఈటల రాజేందర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు కౌశిక్ రెడ్డి.