టీఆర్ఎస్​ లీడర్లు ఇల్లు కూల్చేసిన్రు

టీఆర్ఎస్​ లీడర్లు ఇల్లు కూల్చేసిన్రు
  • ఎంపీడీఓ ఆఫీస్​కు తాళం వేసి బాధితుడి నిరసన

తంగళ్లపల్లి, వెలుగు: ఉన్న ఒక్క గూడును టీఆర్ఎస్ లీడర్లు, ఆఫీసర్లు కూల్చివేశారంటూ రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మానగర్​ గ్రామానికి చెందిన సంతోష్​​ఎంపీడీవో ఆఫీస్​కు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఆఫీసులో  కుటుంబసభ్యులతో కలిసి బైఠాయించాడు. తన సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తుండగా టీఆర్ఎస్ లీడర్లు వచ్చి జేసీబీతో కూల్చివేయించారని సంతోష్ ​ఆరోపించారు. రూ.4 లక్షలు ఇస్తామని, విషయం బయట చెప్పొద్దని అన్నారన్నారు. సంవత్సరం గడిచినా తనకు డబ్బులు ఇవ్వలేదని, అంతేకాకుండా టీఆర్ఎస్ లీడర్లు భూమిని కూడా కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎలాగైనా మంత్రి కేటీఆర్ కలగజేసుకొని తన కుటుంబానికి న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్యే శరణ్యమని అన్నారు. ఎస్సై లక్ష్మారెడ్డి న్యాయం జరిగేలా  చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.