ఈటలకు​ టీఆర్ఎస్​ లీడర్ల సవాల్

ఈటలకు​ టీఆర్ఎస్​ లీడర్ల సవాల్

గజ్వేల్, వెలుగు : గజ్వేల్ ​దేశంలోనే అభివృద్ధికి కేరాఫ్​ అడ్రస్​గా మారిందని, కేసీఆర్​ అడ్డాలో ఆయనపై పోటీకి సై అంటున్న ఈటలకు భంగపాటు తప్పదని గజ్వేల్​ టీఆర్ఎస్​ లీడర్లు అన్నారు. ఆదివారం ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్​రెడ్డి, గజ్వేల్​ మార్కెట్​కమిటీ చైర్మన్​ మాదాసు శ్రీనివాస్​ ఆధ్వర్యంలో గజ్వేల్ టీఆర్ఎస్ శ్రేణులు పట్టణంలోని క్యాంప్ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. గజ్వేల్ లో కాదు మరోసారి హుజూరాబాద్ లో గెలిచి ఉనికి చాటుకోవాలని ఈటలకు సవాల్​ విసిరారు. ఆస్తులను కాపాడుకునేందుకు బీజేపీ కండువా వేసుకొని ఈటల డ్రామాలు ఆడుతున్నారన్నారు. హూజూరాబాద్లో ఓటమి భయం పట్టుకోవడంతో గజ్వేల్ నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ లీడర్లు పాల్గొన్నారు.