రామచంద్రాపురం/అమీన్పూర్, వెలుగు: ప్రభుత్వ భూమిలో చేపట్టిన నిర్మాణాలను తహసీల్దార్కూల్చివేయించడంతో టీఆర్ఎస్లీడర్లు ధర్నాకు దిగారు. మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్630, శ్రీరాంనగర్ కాలనీలో ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేస్తున్నారంటూ తహసీల్దార్విజయ్ఆదేశాల మేరకు రెండు రోజుల క్రితం అధికారులు కూల్చివేశారు. దీనిపై అధికార పార్టీకి చెందిన మున్సిపల్చైర్మన్పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్నర్సింహా గౌడ్, ఇతర టీఆర్ఎస్ కౌన్సిలర్లు తహసీల్దార్ఆఫీసు ఎదుట మంగళవారం నిరసనకు దిగారు.
ఆ నిర్మాణాల క్రమబద్ధీకరణకు నిర్మాణదారులు 58, 59 జీఓ కింద అప్లై చేసుకున్నారని, అయినా కావాలనే అధికారులు కూల్చివేశారని చైర్మన్ ఆరోపించారు. అందుకే బాధితులకు అండగా నిరసనకు దిగినట్లు చెప్పారు. సర్వే నంబర్ 630 అనేది ప్రభుత్వ భూమని, గతంలో చాలామంది అక్కడ ఇళ్లు నిర్మించుకోగా ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని తహసీల్దార్ చెప్పారు. అయితే ఇటీవలి కాలంలో కొందరు ఇష్టానుసారం ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేస్తుండగా అడ్డుకున్నామని చెప్పారు. పాత నిర్మాణాలను తాము కూల్చలేదని, కొత్తగా నిర్మిస్తున్న వాటిపైనే చర్యలు తీసుకున్నామన్నారు.