- కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో ఘటన
లింగంపేట, వెలుగు: తండ్రి పేరుపై ఉన్న భూమిని బదలాయింపు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ ఏసీబీకి పట్టుబడ్డారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తన తండ్రి పేరుపై ఉన్న ఎకరంన్నర భూమిని తన పేరుకు బదిలీ చేయాలని నాగిరెడ్డిపేట తహసీల్దార్ యార్లగడ్డ శ్రీనివాసరావును కోరాడు. ఇందుకు తహసీల్దార్ రూ.50 వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
మంగళవారం రూ.50 వేలు ఇవ్వడానికి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. తహసీల్దార్ ఆఫీస్లో ప్రైవేట్గా పనిచేసే చీనూరి అజయ్ అనే యువకుడికి డబ్బులు ఇవ్వాలని తహసీల్దార్ సూచించడంతో బాధితుడు ఆయనకు రూ.50 వేలు అందజేశాడు. అక్కడే కాపుకాసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. తహసీల్దార్శ్రీనివాసరావు, చీనూరి అజయ్ను అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ తెలిపారు. వీరిని నాంపల్లిలోని ఏసీబీ అడిషనల్ స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపర్చనున్నట్లు తెలిపారు.
