మహిళలను తిట్టిన టీఆర్ఎస్​ లీడర్లు

మహిళలను తిట్టిన టీఆర్ఎస్​ లీడర్లు

ఏటూరునాగారం, వెలుగు: టీఆర్ఎస్​ లీడర్లు  మహిళలను తిట్టడంతో వారిపై తిరగబడ్డారు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో ఆదివారం టీఆర్ఎస్​ గ్రామ కమిటీ ఎన్నిక చేపట్టారు. పాత అధ్యక్షుడు ఈదునూరి రవీందర్ కే తిరిగి అధ్యక్ష పదవి వచ్చేలా సపోర్ట్​ చేయాలని ఆయన అనుచరుడు, బిల్ట్​ కార్మిక సంఘం నాయకుడు ఖుర్బాన్ ​అలీ శనివారం ఒడిశా కాలనీకి చెందిన ఒక్కొక్కరికి సుమారు రూ. 1000 వరకు పంచిపెట్టాడు. ఆదివారం గ్రామ కమిటీ ఎన్నిక కార్యక్రమానికి హాజరైన ఒడిశా కాలనీకి చెందిన కొందరు మహిళలు ఈదునూరి రవీందర్​కు కాకుండా పాత గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు తుక్కాని శ్రీనివాస్​కు సపోర్ట్​ చేశారు. ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఖుర్బాన్​అలీ తమ డబ్బులు తీసుకుని వాడికి సపోర్ట్​ చేస్తున్నారంటూ మహిళలను ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. దీంతో మహిళలు అతడిని కొట్టబోయారు. ఈదునూరి శ్రీనివాస్​ చేతులు జోడించి తప్పయిందని, క్షమించాలని వేడుకోవడంతో మహిళలు శాంతించారు. ఈ గొడవతో ఎన్నికను వాయిదా వేశారు.