కులాల మధ్య రేవంత్ చిచ్చుపెడుతున్నారు

కులాల మధ్య రేవంత్ చిచ్చుపెడుతున్నారు

కుల మతాల పేరుతో రెచ్చగొడితే చివరికి బలి అయ్యేది రేవంత్ రెడ్డే అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. పెయిడ్ వర్కర్స్ తో  రచ్చబండ పెడుతూ.. అనవసరపు కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్న చంద్రబాబు ఏజెంట్ అని విమర్శించారు. హెటిరో పార్థసారధి చేసిన సేవలను గుర్తించే రాజ్యసభ సీటు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అటువంటి వ్యక్తి మీద జగ్గారెడ్డి బురద జల్లడం సరికాదన్నారు. రెడ్డిల చేతిలో అధికారం ఉండాలన్న రేవంత్ వ్యాఖ్యలపై ఇతర కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రేవంత్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్న దానం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కన్పించడం లేదా అని ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే రెడ్డి కులానికి సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. ప్రతి రెడ్డికి 10ఎకరాలు ఉన్నప్పుడే రాజ్యం, రాజకీయం రెడ్ల చేతుల్లో ఉంటుందన్న ఆయన కామెంట్ చేశారు. రెడ్లను నమ్ముకున్న వాళ్లు ఎవరూ మోసపోలేదని.. పార్టీలు గెలవాలంటే రెడ్లకే పార్టీల పగ్గాలు అప్పజెప్పాలని వ్యాఖ్యానించారు. కాకతీయ సామ్రాజ్యం లో ప్రతాప రుద్రుడు వచ్చాక రెడ్డి సామంత రాజులను పక్కన పెట్టి వెలమలైన పద్మనాయకులను దగ్గరికి తీశాడని అందుకే కాకతీయ సామ్రాజ్యం కూలిపోయిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెడ్లకు, వెలమలకు పొసగదన్న రేవంత్ కామెంట్స్ పై పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం

ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీపై ప్రజల నమ్మకాన్ని జయించాలి

కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ టీంలో పీకే మాజీ సహచరుడు