- వెళ్లొద్దని జడ్పీటీసీలు, ఎంపీపీలకు ఆదేశాలు ?
- కోరం లేక వాయిదా పడిన సమావేశం
- చైర్ పర్సన్ కాంగ్రెస్లో చేరడంతోనే దూరం
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జడ్పీ జనరల్బాడీ మీటింగ్కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు డుమ్మా కొట్టారు. చైర్పర్సన్నల్లాల భాగ్యలక్ష్మి, ఆమె భర్త, మాజీ విప్నల్లాల ఓదెలు ఇటీవల టీఆర్ఎస్నుంచి కాంగ్రెస్లో చేరడంతోనే వీళ్లంతా గైర్హాజరైనట్టు చర్చించుకుంటున్నారు. రూల్స్ప్రకారం ప్రతి మూడు నెలలకోసారి జడ్పీ జనరల్బాడీ మీటింగ్నిర్వహించాలి. దీనికి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. ఈ ఏడాది మార్చి 30న సమావేశం జరగ్గా, మళ్లీ ఈ బుధవారం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు జడ్పీ సీఈఓ నరేందర్జూన్15న ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పెద్దపల్లి, ఆదిలాబాద్ ఎంపీలు బోర్లకుంట వెంకటేశ్నేత, సోయం బాపురావు, ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఖానాపూర్ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్రావు, అజ్మీరా రేఖానాయక్తో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీలకు ఆహ్వానాలు పంపారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు మీటింగ్ప్రారంభం కావాల్సి ఉండగా.. జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, కాంగ్రెస్కు చెందిన లక్సెట్టిపేట, దండేపల్లి, భీమిని జడ్పీటీసీలు ముత్తె సత్తయ్య, గడ్డం నాగరాణి, పోతరాజుల గంగవ్వ, లక్సెట్టిపేట ఎంపీపీ అన్నం మంగ హాజరయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్తో పాటు ఆయా శాఖల అధికారులు వచ్చారు. అయితే మధ్యాహ్నం 12 గంటల వరకూ టీఆర్ఎస్కు చెందిన సభ్యులెవరూ రాలేదు. కోరం లేకపోవడంతో మీటింగ్వాయిదా వేస్తున్నట్టు చైర్పర్సన్ప్రకటించారు. అయితే చైర్పర్సన్తో పాటు ఆమె భర్త కాంగ్రెస్లో చేరడంతోనే టీఆర్ఎస్ సభ్యులందరూ మీటింగ్కు దూరంగా ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు స్వయంగా ఎమ్మెల్యేలే.. జడ్పీటీసీలకు, ఎంపీపీలకు ఫోన్లు చేసి మీటింగ్కు వెళ్లొద్దని హుకుం జారీ చేసినట్టు సమాచారం.
ప్రజా సమస్యల పరిష్కారం ఎట్లా?
జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై జడ్పీ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పలు తీర్మానాలు ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జడ్పీలో 16 మంది జడ్పీటీసీలు, ఇద్దరు కో ఆప్షన్ మెంబర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆరుగురు కలిపి మొత్తం 24 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్కు చెందిన వారు నలుగురు మాత్రమే. మీటింగ్జరగాలంటే 1/3 కోరం అంటే 8మంది సభ్యులు హాజరుకావాలి. తీర్మానాలు ఆమోదించడానికి 2/3 కోరం అంటే 16 మంది సభ్యులుండాలి. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ మెంబర్లు హాజరైతే తప్ప జడ్పీ సమావేశాలు ముందుకు సాగే పరిస్థితి లేదు.
దళిత మహిళ కావడంతోనే...
జడ్పీ చైర్పర్సన్తో వ్యక్తిగతంగా, రాజకీయంగా విభేదాలుంటే జడ్పీని రాజకీయ కక్షసాధింపులకు వేదికగా వాడుకోవడం ఏమిటని ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి విమర్శించారు. జడ్పీ చైర్పర్సన్ దళిత మహిళ కావడంతోనే అవమానిస్తున్నారన్నారు. వానాకాలం సీజన్లో రైతులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని మీటింగ్లో వాటి గురించి చర్చించే అవకాశం లేకుండా చేశారని అన్నారు.