పోలింగ్సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు ఉండాలి : ఎస్పీ రాజేశ్చంద్ర

పోలింగ్సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు ఉండాలి : ఎస్పీ రాజేశ్చంద్ర

బాన్సువాడ, వెలుగు : మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ప్రతి పోలింగ్ సెంటర్ల​వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ రాజేశ్​చంద్ర పోలీస్​అధికారులకు సూచించారు. బుధవారం బాన్సువాడ పోలింగ్​సెంటర్​తోపాటు పరిసర ప్రాంతాలను పరిశీలించి డీఎస్పీతో చర్చించారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్​ జరిగేలా చూడాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.  ఎస్పీ వెంట డీఎస్పీ విట్టల్ రెడ్డి, సీఐ శ్రీధర్, ఎస్సైలు ఉన్నారు.