
టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం
మునుగోడు/నల్గొండ అర్బన్, వెలుగు: రాష్ట్రంలోని ప్రజల సమస్యలను పరిష్కరించకుండా నియంత పాలన కొనసాగిస్తున్న కేసీఆర్పాలనకు రానున్న రోజుల్లో చరమగీతం పాడాలని టీజేఎస్రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ కోరారు. సోమవారం నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో ప్రైవేట్కాలేజీ, స్కూల్టీచర్లు ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ ను ఓడించాలని సూచించారు. 9 నెలలుగా కరోనా కారణంగా స్కూల్స్మూసివేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3.7 లక్షల మంది ప్రైవేటు టీచర్లు పూట గడవక ఇబ్బంది పడుతున్నారన్నారు. వారికి ఎలాంటి సహాయం అందించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రైవేట్టీచర్ల సమస్యలు సీఎం కేసీఆర్ కు వివరించేందుకు వెళితే అవకాశం ఇవ్వకపోగా ఆందోళన చేపడితే అరెస్టులు చేసి స్టేషన్ లో కూర్చోబెడుతున్నారని అన్నారు. షరతుల సాగుతో రైతులను అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మారబోయిన శ్రీధర్ పాల్గొన్నారు.
అగ్రి చట్టాలను రద్దు చేయాలె
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలపై ఈ నెల 8న చేపట్టనున్న భారత్బంద్కు టీజేఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని కోదండరాం అన్నారు. సోమవారం నల్గొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బంద్లో టీజేఎస్ కార్యకర్తలు క్రియాశీలకంగా పాల్గొనాలని సూచించారు. వెంటనే 3 చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.