TRS విజయ గర్జన సభ మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 29న వరంగల్ లో TRS విజయ గర్జన సభ ను నిర్వహించాలని నిర్ణయించింది. అయితే స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను ఇవాళ(మంగళవారం) ఎన్నికల సంఘం ప్రకటించడంతో సభను వాయిదా వేసినట్లు టీఆర్ఎస్ తెలిపింది.
మొదట హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత ఈ నెల 15 విజయ గర్జన నిర్వహించాలని నిర్ణయించింది టీఆర్ఎస్. ఆ తర్వాత సభను ఈ నెల 29కి వాయిదా వేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ కోడ్ కారణంగా సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
ఈ క్రమంలోనే రేపు వరంగల్, హనుమకొండలో పర్యటంచాల్సిన సీఎం పర్యటన కూడా రద్దయ్యింది.