బీజేపీ బ్యాక్ డోర్ పాలిటిక్స్ మానుకోవాలి

బీజేపీ బ్యాక్ డోర్ పాలిటిక్స్ మానుకోవాలి

మునుగోడులో ప్రస్తుతం రాజకీయాలు నడుస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మునుగోడు టీఆర్ఎస్ కంచుకోట అని..ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని దీమా వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా దోమల్గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కూల్ లో వనమహోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హుజుర్ నగర్, నాగార్జున సాగర్ లాగే మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగురుతుందన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదని..ప్రజాసంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ బ్యాక్డోర్ పాలిటిక్స్ మానుకోవాలని హితవు పలికారు

దేశం కోసం త్యాగం చేసిన వారిని స్మరించుకోవడానికి సీఎం కేసీఆర్ అద్బుతమైన కార్యక్రమాలు చేపడుతున్నారని కవిత చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో మంది పోరాటం చేశారని చెప్పారు. తెలంగాణ రాక ముందు గ్రీనరీ 21 శాతం ఉంటే..ఇప్పుడు 31 శాతానికి పెరిగిందన్నారు. 34 శాతానికి గ్రీనరీ పెరిగే వరకు తెలంగాణ ప్రజలు నిష్క్రమించవద్దని కోరారు. ప్రతి ఒక్కరు జై హింద్ అనాలి..ప్రతి ఒక్కరు మొక్కలు నాటలని కవిత పిలుపునిచ్చారు.