
- తన సన్నిహితుడిని నియమించుకున్న ట్రంప్
వాషింగ్టన్: భారత్లో అమెరికా కొత్త రాయబారిగా యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ట్రంప్ తన సన్నిహితుడైన సెర్గియో గోర్ను నియమించారు. గోర్ను దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక రాయబారిగా కూడా ప్రకటించారు.
తన ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ ఈ విషయం వెల్లడించారు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న ఈ ప్రాంతంలో తన ఎజెండాను అమలు చేయడానికి, అమెరికాను గొప్పగా మార్చడానికి నమ్మకమైన వ్యక్తి అవసరమని.. అందుకే గోర్ను ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు.
సెర్గియో గోర్ ప్రస్తుతం వైట్హౌస్లో పర్సనల్ డైరెక్టర్గా ఉన్నారు. ట్రంప్ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తూ, ప్రభుత్వ ఉన్నత స్థానాలకు నియామకాల పరిశీలనలో భాగమవుతున్నారు.