
పుల్వామా ఘటన తర్వాత అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కీలక కామెంట్స్చేశారు. పుల్వామా ఘటన తర్వాత ఇండియా బలంగా కనిపిస్తోందని ట్రంప్ అన్నారు. కాశ్మీర్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పారు. ఇండియా-పాకిస్థాన్ల మధ్య నెలకొన్న పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని ట్రంప్ చెప్పారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఆగాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు. చైనా ట్రేడ్ ప్రతినిధి బృందంతో అమెరికా వైట్హౌస్ ఓవల్ ఆఫీస్లో సమావేశం తర్వాత ..పుల్వామా ఘటనపై మీడియా అడిగిన ప్రశ్నలకు డోనాల్డ్ ట్రంప్ సమాధానం చెప్పారు. తమకు సహకరించని పాకిస్థాన్పై కఠిన చర్యలు తీసుకున్నట్టు ట్రంప్ చెప్పారు. దీంట్లో భాగంగానే ఏటా ఆదేశానికి ఇస్తున్న1.3 బిలియన్ అమెరికన్ డాలర్ల సాయాన్ని ఆపేసినట్టు ట్రంప్ తెలిపారు. పుల్వామా ఘటన తర్వాత ఇండియా అనుసరించిన విదేశీ విధానాలు మంచి ఫలితాల్నే ఇచ్చాయి. పాక్ భూభాగం నుంచే టెర్రర్ అటాక్కు కుట్ర జరిగిందన్న ఆధారాలతో కూడిన ఇండియా వాదనకు ముందుగా అమెరికా మద్దతు తెలిపింది. ఆతర్వాత మిగిలిన ప్రపంచ దేశాలు ఇండియాకు సపోర్ట్ చేశాయి.
పాక్ ను ఇండియా ఎలా నిలువరిస్తోంది?
ప్రపంచ దేశాల్లో పాక్ను ఏకాకిని చేయడానికి ఇండియాకు పుల్వామా ఘటన కలిసివచ్చింది. ఇప్పటికే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ జాబితా నుంచి ఇండియా ఆదేశాన్ని తొలగించింది. మనదేశం నుం చి పాక్కు వెళుతున్న సింధు జలాల్లో మన వాటా నీటిని పూర్తిగా మన అవసరాలకే వాడుకోవాలని నిర్ణయించడం ద్వారా వాటర్ సర్జికల్ స్ట్రైక్ను ఇండియా ప్రారంభించింది. సెక్యూ రిటీ కౌన్సిల్లోనూ పాక్ను దోషిగా చూపడంలో ఇండియా విజయం సాధించింది. పాక్ కు మద్దతు ఇస్తున్న చైనాకు చెందిన హైలెవల్ అధికారుల సమావేశంలోనే అమెరికా ప్రెసిడెంట్ చేసిన కామెంట్స్ ఇండియాకు మరింత బలాన్ని ఇచ్చాయి.