పోలండ్ కు 5 వేల మంది అమెరికా సైన్యం : ట్రంప్ నిర్ణయంపై యూరోపియన్ దేశాల్లో ఆందోళన

పోలండ్ కు 5 వేల మంది అమెరికా సైన్యం : ట్రంప్ నిర్ణయంపై యూరోపియన్ దేశాల్లో ఆందోళన

యూరోపియన్ యూనియన్ లో అస్థిరత్వానికి ట్రంప్ ప్లాన్ చేస్తున్నారా..? ఇరాన్ పై యుద్ధంలో తమకు మద్ధతుగా రాని యూరోప్ దేశాలపై కక్ష్య తీర్చుకోనున్నారా..? ట్రంప్ లేటెస్టుగా తీసుకున్న నిర్ణయం చూస్తే అలాగే అనిపిస్తుంది. పోలండ్ కు 5 వేల మంది సైనుకులను పంపుతున్నట్లు ట్రంప్ ప్రకటించడం ఇలాంటి ఊహాగానాలకు తావిస్తోంది. పోలండ్ లో ఇప్పటికే ఉన్న బలగాలను కాదని మరో 5000 మందిని పంపడంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. 

యూరప్‌లో అమెరికా సైనికుల సంఖ్యను తగ్గించాలని తన ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యలకు విరుద్ధంగా, పోలాండ్‌కు అదనంగా 5,000 మంది సైనికులను పంపనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు .

పోలాండ్‌లో వంతులవారీగా పర్యటించాల్సిన బలగాలను క్రమంగా తగ్గిస్తామని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించిన వారం తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అమెరికాకు అవసరమైనప్పుడు ముందుకు రాని యూరోపియన్ దేశాల పట్ల ఉన్న ఆగ్రహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ అధికార వర్గం తెలిపింది.

ఇరాన్‌ యుద్ధంలో అమెరికా అవమానానికి గురవుతోందని  జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ అనడంతో ట్రంప్‌కు కోపం వచ్చింది. దీనికి కొనసాగింపుగా జర్మనీ నుండి 5,000 మంది సైనికులను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.

దీనికి విరుద్ధంగా, పొరుగున ఉన్న ఉక్రెయిన్‌కు యూరోపియన్ సహాయం అందించడంలో కీలక మార్గమైన పోలాండ్‌కు సైనిక బలగాలను పంపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా మాట్లాడిన ట్రంప్.. నేను గర్వంగా బలపరిచిన, పోలాండ్ ప్రస్తుత అధ్యక్షుడు కరోల్ నవ్రోకీ విజయవంతంగా ఎన్నికైనందున, ఆయనతో మాకున్న సంబంధం ఆధారంగా, యునైటెడ్ స్టేట్స్ పోలాండ్‌కు అదనంగా 5,000 మంది సైనికులను పంపబోతోందని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను, అంటూ తన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు.

ట్రంప్ ప్రస్తావించిన 5,000 మంది సైనికులు ఎక్కడి నుంచి వస్తారో, అది యూరప్‌లోని అమెరికా సైనిక సంఖ్యను ఎలా మారుస్తుందో స్పష్టంగా తెలియడం లేదు. ఇరాన్ యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడిన లేదా తనకు తగినంత సహాయం అందలేదని భావించిన నాటో మిత్రదేశాలపై ట్రంప్ కోపంగా ఉన్న తరుణంలో..  ఈ ఆకస్మిక ప్రకటన యూరప్‌లో అమెరికా వైఖరిపై మరింత ఆందోళనను సృష్టిస్తోంది.