
తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ లను బదిలీ చేసింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పలు శాఖలను ప్రక్షాళన చేస్తున్న సర్కార్ భారీగా అధికారులను ట్రాన్స్ ఫర్ చేస్తుంది. ఈ క్రమంలో ఇవాళ మరో 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read :- ఇంటర్తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
- ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ : టీ.కె.శ్రీదేవి
- వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ గా: రిజ్వీకి అదనపు బాధ్యతలు
- డిజాస్టర్ మేనేజ్ మెంట్ జాయింట్ సెక్రటరీగా హరీష్
- మార్కెటింగ్ శాఖ కమిషనర్ గా ఉదయ్ కు అదరనపు బాధ్యతులు
- హాకా ఎండీగా కె. చంద్రశేఖర్ రెడ్డి
- మార్క్ ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డి
- పురపాలక శాఖ డిప్యూటీ సెక్రటరీగా ప్రియాంక
- రవాణా ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ గా వికాస్ రాజ్