
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న 9,210 పోస్టుల భర్తీ కోసం ఈ నెల 1 నుంచి ప్రారంభమైన ఆన్లైన్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించిన ఎగ్జామ్స్కు మొత్తం 75.68% మంది అటెండ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ట్రిబ్) కన్వీనర్ డాక్టర్ మల్లయ్య భట్టు ప్రకటించారు. ఎగ్జామ్స్ కు సంబంధించిన ప్రైమరీ కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్ వెబ్ సైట్లో పెట్టామని ఆయన తెలిపారు. అభ్యర్థులు కీ తీసుకోవచ్చని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల26లోగా తెలపాలని సూచించారు. ఈ మెయిల్, పిటిషన్ల ద్వారా ఇచ్చేవాటిని పరిగణనలోకి తీసుకోబోమని చెప్పారు.