కాళేశ్వరం లిఫ్ట్‌లోని బ్యారేజీలు ప్రారంభించనున్న మంత్రులు

కాళేశ్వరం లిఫ్ట్‌లోని బ్యారేజీలు ప్రారంభించనున్న మంత్రులు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో నిర్మించిన వివిధ బ్యారేజీలు, పంప్ హౌస్ లను రాష్ట్ర మంత్రులు ప్రారంభించనున్నారు. ధర్మారం మండలంలో నంది మేడారం దగ్గర ప్యాకేజ్ 6లో భాగంగా నిర్మిస్తున్న పంప్ హౌస్ ను రాష్ట్ర కార్మిక, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభిస్తారు. మంథని మండలంలో నిర్మిస్తున్న అన్నారం పంపుహౌస్, సుందిళ్ల బ్యారేజీ లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, మంత్రి ఈశ్వర్ ప్రారంభిస్తారు. అంతర్గాం మండలంలో గోలివాడ దగ్గర నిర్మిస్తున్న సుందిళ్ల పంప్ హౌస్ ను కూడా ప్రారంభిస్తారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన వివిధ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నాయి.