రాజమండ్రి నుంచి షోలాపూర్​కు గంజాయి

రాజమండ్రి నుంచి షోలాపూర్​కు గంజాయి
  • సిటీ మీదుగా తరలిస్తుండగా పట్టుకున్న టీఎస్ నార్కొటిక్స్ బ్యూరో
  • ఇద్దరు అరెస్ట్.. 22 కిలోల సరకు సీజ్


హైదరాబాద్‌‌‌‌,వెలుగు: గంజాయిని తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్‌‌‌‌ను టీఎస్‌‌‌‌ నార్కోటిక్స్‌‌‌‌ బ్యూరో(న్యాబ్) అరెస్ట్ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బీదర్​కు చెందిన జలాలుద్దీన్‌‌‌‌ సిద్దిఖి అహ్మద్(45) మహారాష్ట్రలోని  ఔరంగాబాద్‌‌‌‌లో ఉంటున్నాడు. వయిజాపూర్​కు చెందిన నయీం అనే గంజాయి పెడ్లర్ చెప్పిన విధంగా ఏపీలోని అరకు నుంచి గంజాయిని షోలాపూర్​కు ట్రాన్స్ పోర్టు చేసేవాడు. తన బంధువు జమీల్​తో కలిసి ఇటీవల రాజమండ్రికి వెళ్లిన జలాలుద్దీన్ అక్కడ  పండు అనే పెడ్లర్ నుంచి 22 కిలోల గంజాయిని కొన్నాడు. నానో కారులో సిటీకి బయలుదేరాడు. టీఎస్ న్యాబ్ పోలీసులు శనివారం అబ్దుల్లాపూర్ మెట్ వద్ద కారును అడ్డుకున్నారు. జలాలుద్దీన్, జమీల్​ను అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.