- సిటీ మీదుగా తరలిస్తుండగా పట్టుకున్న టీఎస్ నార్కొటిక్స్ బ్యూరో
- ఇద్దరు అరెస్ట్.. 22 కిలోల సరకు సీజ్
హైదరాబాద్,వెలుగు: గంజాయిని తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్ను టీఎస్ నార్కోటిక్స్ బ్యూరో(న్యాబ్) అరెస్ట్ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బీదర్కు చెందిన జలాలుద్దీన్ సిద్దిఖి అహ్మద్(45) మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉంటున్నాడు. వయిజాపూర్కు చెందిన నయీం అనే గంజాయి పెడ్లర్ చెప్పిన విధంగా ఏపీలోని అరకు నుంచి గంజాయిని షోలాపూర్కు ట్రాన్స్ పోర్టు చేసేవాడు. తన బంధువు జమీల్తో కలిసి ఇటీవల రాజమండ్రికి వెళ్లిన జలాలుద్దీన్ అక్కడ పండు అనే పెడ్లర్ నుంచి 22 కిలోల గంజాయిని కొన్నాడు. నానో కారులో సిటీకి బయలుదేరాడు. టీఎస్ న్యాబ్ పోలీసులు శనివారం అబ్దుల్లాపూర్ మెట్ వద్ద కారును అడ్డుకున్నారు. జలాలుద్దీన్, జమీల్ను అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.