మహిళల నుంచి ఛార్జీల వసూలుపై విచారించి చర్యలు తీసుకుంటాం: ఆర్టీసీ ఎండీ సజ్జనార్

మహిళల నుంచి ఛార్జీల వసూలుపై విచారించి చర్యలు తీసుకుంటాం: ఆర్టీసీ ఎండీ సజ్జనార్

నిజామాబాద్ జిల్లాలో బస్సులో ప్రయాణిస్తున్న మహిళల నుంచి ఛార్జీలు వసూలు చేసిన ఘటనపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు.నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలో మహిళకు డబ్బులు తీసుకొని టికెట్ జారీ చేసిన ఘటనపై విచారణకు ఆదేశించాం. సంబంధిత కండక్టర్  ను డిపో  స్పేర్ లో ఉంచాం. విచారణ అనంతరం కండక్టరుపై శాఖపరమైన  చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.  

తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 9 నుంచి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే.. ఆదివారం( డిసెంబర్ 10) బస్సులో ప్రయాణిస్తున్న మహిళలనుంచి ఓ కండక్టర్ ఛార్జీలను వసూలు చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఏపీ 25జెడ్ 0062 నెంబరు గల బస్సు నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తుండగా ముగ్గురు మహిళలు నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్లేందుకు బస్సు ఎక్కారు. ముగ్గురు మహిళల దగ్గర బస్సు టికెట్ కోసం డబ్బులు వసూలు చేశాడు కండక్టర్.

 

మహిళలను నుంచి ఛార్జీలు వసూలుకు సంబంధించిన వీడియో సోషల్ వైరల్ అయింది. బాధితురాలి బంధువులు ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ డిపో మేనేజర్ తో పాటు టీఎస్ ఆర్టీ సీ ఎండీ సజ్జనార్ కూడా స్పందించారు. కండకర్టపై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు.