
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) ఫలితాలు సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానున్నాయి. ఉదయం 10గంటలకు టెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్టు టెట్ కన్వీనర్ రాధారెడ్డి వెల్లడించారు. ఫలితాలు https://tstet.cgg.gov.in/ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. పేపర్-2తో పోల్చుకుంటే పేపర్-1 పేపర్ ఈజీగా వస్తే, పేపర్-2 కాస్తా టఫ్గా వచ్చింది. ఈ క్రమంలోనే టెట్ ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించారు. పేపర్-1 పరీక్షను 2,26,744 (84.12శాతం) రాశారు. బీఈడీ విద్యార్థులకే అర్హత ఉన్న పేపర్-2 పరీక్షను 91.11 శాతం మంది రాశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరిగింది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 రాతపరీక్ష నిర్వహించింది. పేపర్-1కు 2.26 లక్షలు, పేపర్-2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. ఇటీవలే టెట్ ప్రాథమిక కీ విడుదల చేసిన అధికారులు..సెప్టెంబర్ 27వ తేదీన ఫలితాలను విడుదల చేయనున్నారు.