- టీజీ టెట్– 2026 డిజిటల్ కోచింగ్పోస్టర్ను ఆవిష్కరించిన
- మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: టెట్ అభ్యర్థులకు వచ్చే 44 రోజుల పాటు టీసాట్ఆన్లైన్ కోచింగ్ ఇవ్వనుంది. మంగళవారం స్పెషల్ లైవ్ను ప్రారంభించిన టీసాట్.. బుధవారం కూడా దానిని కొనసాగించనుంది. వచ్చే 44 రోజుల పాటు 200 ఎపిసోడ్ల డిజిటల్కంటెంట్ను అభ్యర్థుల కోసం ప్రసారం చేయనుంది. ఈ మేరకు మంగళవారం సెక్రటేరియెట్లో ‘టీజీ టెట్ 2026 డిజిటల్కోచింగ్’ పోస్టర్ను ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.
టీసాట్లో డిజిటల్ కంటెంట్ద్వారా టెట్కు అభ్యర్థులు సిద్ధం కావాలని సూచించారు. టీసాట్ నెట్వర్క్లో అందుబాటులో ఉండే కంటెంట్ అన్ని స్థాయిల అభ్యర్థులకు ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం టీ-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి మాట్లుడుతూ.. బుధవారం ప్రత్యేకంగా ఒరియెంటేషన్ను నిర్వహిస్తున్నామని, మరో 44 రోజులు 200 ఎపిసోడ్స్ ప్రసారం చేయనున్నట్టు చెప్పారు.
టీసాట్ నిపుణ చానల్ లో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు, విద్య చానెల్లో ఉదయం ఐదు గంటల నుంచి 7 గంటల వరకు ప్రతి రోజు నాలుగు గంటల పాటు ప్రత్యేక ప్రసారాలుంటాయని పేర్కొన్నారు.
