ఎంసీహెచ్ నిర్మాణ​ స్థలాన్ని పరిశీలించిన ఇంజనీర్లు

ఎంసీహెచ్ నిర్మాణ​ స్థలాన్ని పరిశీలించిన ఇంజనీర్లు

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల ఐబీ ఆవరణలోని ఎంసీహెచ్​ నిర్మాణ స్థలాన్ని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావుతో కలిసి టీఎస్​ఎంఐసీ ఇంజనీర్లు సోమవారం పరిశీలించారు.  ఎంసీహెచ్​ నిర్మాణం కోసం మెడికల్​ అండ్​ హెల్త్​ డిపార్ట్​మెంట్​కు అప్పగించడం తెలిసిందే. ఐబీలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​తో పాటు గెస్ట్​హౌస్​, ఆర్​అండ్​బీ ఆఫీసులు ఉన్న బిల్డింగులను తొలగించి అక్కడ ఎంసీహెచ్​ను నిర్మించనున్నారు. 

స్థలాన్ని స్వాధీనం చేసుకొని త్వరగా పనులు ప్రారంభించాలని సీనియర్​ ఇంజనీర్​ విద్యాసాగర్​ను ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు కోరారు. గత ప్రభుత్వం అనాలోచితంగా గోదావరికి దగ్గరలో ఎంసీహెచ్​ను నిర్మించింది. గత రెండేండ్లుగా గోదావరి వరదల్లో ఎంసీహెచ్​ మునిగింది. ఏటా వానాకాలంలో ముంపు ముప్పు పొంచివుండడంతో ఎంసీహెచ్​ను ఐబీలో నిర్మించాలని ప్రేమ్​సాగర్​రావు ప్రభుత్వాన్ని కోరగా సానుకూలంగా  స్పందించింది.