టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసులో మూడో రోజు నిందితులను సిట్ విచారిస్తోంది. అక్టోబర్ నుంచే పేపర్ లీక్ అయినట్లు గుర్తించిన సిట్ అధికారులు నిందితుల లావాదేవీలపై కూపీ లాగుతున్నారు. రాజశేఖర్ రెడ్డి , ప్రవీణ్, రేణుక వీళ్ల మధ్య జరిగిన ట్రాన్సక్షన్స్ గురించి ఆరా తీస్తున్నారు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు పేపర్ ఎవరెవరు తీసుకున్నారో వారిని గుర్తించి కేసులు నమోదు చేయనుంది సిట్. అలాగే రాజేశేఖర్ రెడ్డి ప్రవీణ్, ఎవరెరవరితో చాటింగ్ చేశారనే వివరాలను సిట్ రాబడుతోంది. ఎవరెవరితో కాల్స్ మాట్లాడారు, లిస్ట్ ఆధారంగా సిట్ దర్యాప్తు చేస్తోంది.
రెండో రోజు నిందితులను 7 గంటల పాలు విచారించిన సిట్ అధికారులు ప్రశ్నాపత్రాలు ఎవరెవరికి ఇచ్చారో వారి వివరాలను సేకరించారు. టీఎస్ పీఎస్సీలో ప్రవీన్ నిర్వహించిన విధుల వివరాలను రికార్డ్ చేశారు.