
సలహాదారు వేం నరేందర్ రెడ్డికి టీఎస్పీటీఏ వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షౌకత్ అలీ, రోహిత్ నాయక్ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కోరారు. మంగళవారం హైదరాబాద్లో వారు వేం నరేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు.
ఏకీకృత సర్వీసు అమలు చేయాలని, లాంగ్వేజీ పండిట్ల పోస్టులను అప్గ్రేడ్ చేయాలని, పదివేల పీఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని కోరారు. ప్రతీ ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఇద్దరు టీచర్లను నియమించాలని, జీవో 472 ప్రకారం ఉర్దూ మీడియం స్కూళ్లలో టీచర్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ అంశాలపై వేం నరేందర్ రెడ్డి స్పందిస్తూ.. కాంగ్రెస్ సర్కారు.. ఉద్యోగుల ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు.