14 రోజుల్లో ఆర్టీసీకి రూ.183.39 కోట్ల ఇన్​కం

14 రోజుల్లో ఆర్టీసీకి రూ.183.39 కోట్ల ఇన్​కం

హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీకి దసరా పండగ కాసుల వర్షం కురిపించింది. రెగ్యులర్, స్పెషల్ బస్సుల ద్వారా 14 రోజుల్లో రూ.183.39 కోట్ల ఇన్​కం వచ్చినట్లు అధికారులు సోమవారం తెలిపారు. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో రెవెన్యూ పెరిగిందన్నారు. ఆర్టీసీ గత నెల 26 నుంచి ఆదివారం దాకా మొత్తం 341.64 లక్షల మందిని వారి గమ్య స్థానాలకు చేర్చిందన్నారు.

ఆక్యుపెన్సీ రేషియా (సీట్లు నిండే సామర్థ్యం) 63.57 కాగా.. మొత్తం 442.86 లక్షల కి.మీ దూరం బస్సులు తిరిగాయని వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 44.54 కోట్ల అదనపు ఇన్​కం వచ్చిందని అధికారులు తెలిపారు.