
- పట్టణాలతోపాటు త్వరలో గ్రామాలకు కరెంటు బస్సులు నడుపుతాం:
- టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్
వికారాబాద్ జిల్లా: ఆర్టీసీ లాభాల బాట పట్టిందన్నారు ఆ సంస్థ ఎండీ సజ్జనార్. రాష్ట్రంలో ఎక్కడా ఆర్టీసీ డిపోలు ఎత్తివేసే ప్రసక్తే లేదన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ డిపోను సందర్శించారు సజ్జనార్. డిపో నిర్వహణపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ ఆదాయం పెరిగిందన్నారు సజ్జనార్. ప్రయాణికులు స్వచ్చందంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అదనపు బస్సులు నడిపుతున్నామని తెలిపారు.
దూర ప్రాంతాలకు స్లీపర్, ఏసీ, నాన్ ఏసీ బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలు సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీని ఎంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని.. అందరూ ఆర్టీసీ సేవలను ఉపయోగించుకోవాలని ఎండీ సజ్జనార్ కోరారు.
ఇవి కూడా చదవండి
సినిమాల్లో నారదుడి పాత్రను వక్రీకరించడం బాధాకరం
బోస్టన్లో 'జై భీమ్' కు అవార్డుల పంట
కేటీఆర్ ఆస్తులు ఆరు రెట్లు పెరిగినయ్!