కేటీఆర్ ఆస్తులు ఆరు రెట్లు పెరిగినయ్!

కేటీఆర్ ఆస్తులు ఆరు రెట్లు పెరిగినయ్!

న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ‘ఆస్క్ కేటీఆర్’ అనే కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఇందుకు స్పందించిన మాణిక్కం ఠాగూర్ అదే వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ఆస్తులు పెంచుకోడానికి రహస్యమేంటో కేటీఆర్ రాష్ట్ర యువతకు చెప్పాలని వ్యంగంగా కామెంట్ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేటీఆర్ సమర్పించిన అఫిడవిట్ లో తనకు రూ.7 కోట్ల ఆస్తులున్నాయని పేర్కొన్నారని... 2018 వచ్చే వరకు కేటీర్ ఆస్తులు రూ.41 కోట్లకు పెరిగాయని ఠాగూర్ తెలిపారు. 2018 నుంచి 2023 వరకు టార్గెట్ ఎంత అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు.