రూ.50తో 30 కిలోమీటర్ల జర్నీ

రూ.50తో 30 కిలోమీటర్ల జర్నీ
  • కొత్తగా టీ9 30 టికెట్‌‌‌‌‌‌‌‌ అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ
  • ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా చెల్లుబాటు
  • టీ9 60 టికెట్‌‌‌‌‌‌‌‌ను అందరికీ వర్తింపజేస్తూ సంస్థ చైర్మన్‌‌‌‌‌‌‌‌, ఎండీ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు : రూరల్, అర్బన్ ప్రాంతాల్లో తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఆర్టీసీ మరో రాయితీ పథకాన్ని తీసుకొచ్చింది. పల్లె వెలుగు బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా ‘టీ9- 30 టికెట్’ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే టీ9 -60 అందుబాటులో ఉండగా, ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు టీ9- 30 టికెట్‌‌‌‌‌‌‌‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. బుధవారం బస్ భవన్‌‌‌‌‌‌‌‌లో ‘టీ9- 30 టికెట్’పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఆవిష్కరించారు. ఈ టికెట్‌‌‌‌‌‌‌‌కు రూ.50 చెల్లిస్తే 30 కిలోమీటర్ల పరిధిలో అప్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌ ప్రయాణించవచ్చని తెలిపారు.

ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఈ టికెట్‌‌‌‌‌‌‌‌ చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 27 (గురువారం) నుంచి ఈ టికెట్ అమల్లోకి వస్తుందని, పల్లె వెలుగు బస్సు కండక్టర్ల వద్ద టికెట్‌‌‌‌‌‌‌‌ అందుబాటులో ఉంటుందని చెప్పారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టికెట్‌‌‌‌‌‌‌‌ను వారు ఇస్తారని వెల్లడించారు. తక్కువ దూరం ప్రయాణించే ఉద్యోగులు, వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులకు టీ9- 30 టికెట్ ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. 

ఇతర రాష్ట్రాలకు వర్తింపు..

30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర రాష్ట్రాలకు కూడా ఈ టీ9 30 టికెట్ వర్తిస్తుందని చైర్మన్ ఎండీ సజ్జనార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు.ఈ టికెట్ ద్వారా ఒక్కొక్కరికి రూ.10 నుంచి రూ.30 వరకు ఆదా అవుతుందని చెప్పారు. ఈ టికెట్‌‌‌‌‌‌‌‌ తీసుకున్న ప్యాసింజర్లు రిటర్న్ జర్నీలో రూ.20 కాంబి టికెట్ తీసుకుని ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించవచ్చని తెలిపారు. నెల రోజులు ఈ టికెట్ అందుబాటులో ఉంటుందని, ప్రయాణికుల స్పందనను బట్టి ఆ తర్వాత పొడిగిస్తామని వెల్లడించారు.

ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన టీ9 -60 టికెట్‌‌‌‌‌‌‌‌ను పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే వారందరికీ వర్తింపజేస్తున్నట్లు చైర్మన్, ఎండీ ప్రకటించారు. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకొచ్చిన ఈ టికెట్‌‌‌‌‌‌‌‌ను గురువారం నుంచి పురుషులకు కూడా వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానుపోను ప్రయాణించే ఈ టికెట్‌‌‌‌‌‌‌‌కు మంచి స్పందన వచ్చిందని తెలిపారు.