44 నిమిషాల్లో2.20 లక్షల టికెట్లు బుక్

44 నిమిషాల్లో2.20 లక్షల టికెట్లు బుక్

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు రికార్డ్ టైమ్ లోనే బుక్ అయిపోయాయి. ఆన్ లైన్ లో విడుదల చేసిన 44 నిమిషాలకే 2 లక్షల 20 వేల టికెట్లు బుక్ అయ్యాయి. ఇవాళ ఉదయం 9 గంటలకు శ్రీవారి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో ఉంచింది. జనవరి 1 నుంచి 11 వరకు.. రోజుకు 20 వేల చొప్పున వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయగా.. 44 నిమిషాల్లోనే టికెట్లన్నింటినీ బుక్ చేసుకున్నారు భక్తులు. జనవరి 2న వైకుంఠ ఏకాదశి, 3న ద్వాదశి పురష్కరించుకొని 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు ఏర్పాటు చేశారు.