బిగ్ సీకి 20 ఏళ్లు .. టాప్​లో కొనసాగుతాం: సీఎండీ ఎం.బాలు చౌదరి

బిగ్ సీకి 20 ఏళ్లు .. టాప్​లో కొనసాగుతాం: సీఎండీ ఎం.బాలు చౌదరి
  • రెండేళ్లలో స్టోర్లు 400కు చేరుతాయి

హైదరాబాద్​, వెలుగు: మల్టీ బ్రాండ్‌‌‌‌‌‌‌‌ మొబైల్స్‌‌‌‌‌‌‌‌ రిటెయిల్‌‌‌‌‌‌‌‌ చెయిన్‌‌‌‌‌‌‌‌ బిగ్‌‌‌‌‌‌‌‌–సీ  ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో  రూ.1,500 కోట్ల టర్నోవర్‌‌‌‌‌‌‌‌ టార్గెట్ పెట్టుకుంది. 2022–23లో కంపెనీ  టర్నోవర్​  రూ.1,000 కోట్లు.  ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో  బిగ్‌‌‌‌‌‌‌‌–సీ  కంపెనీకి  250 అవుట్‌‌‌‌‌‌‌‌లెట్లు ఉన్నాయి. రాబోయే రెండేళ్లలో వీటిని  400 లకు చేరుస్తామని కంపెనీ  ఫౌండర్, సీఎండీ ఎం.బాలు చౌదరి తెలిపారు. బిగ్​–సీ పుట్టి  ఇరవై ఏళ్లు  పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో భాగంగా కంపెనీ  బ్రాండ్‌‌‌‌‌‌‌‌ అంబాసిడర్, సినీ నటుడు మహేశ్‌‌‌‌‌‌‌‌ బాబు శామ్‌‌‌‌‌‌‌‌సంగ్‌‌‌‌‌‌‌‌ కొత్త మోడల్స్​ ఫ్లిప్, ఫోల్డ్‌‌‌‌‌‌‌‌ ఫోన్లను లాంఛ్​ చేశారు.   

బిగ్‌‌‌‌‌‌‌‌–సీ ఈడీ స్వప్న కుమార్‌‌‌‌‌‌‌‌, డైరెక్టర్లు బాలాజీ రెడ్డి, గౌతమ్ రెడ్డి, కైలాష్ తో కలిసి ఆదివారం  ఆయన మీడియాతో మాట్లాడారు. 2002 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 23న బిగ్‌‌‌‌‌‌‌‌–సీ  జర్నీ మొదలైంది. మొబైల్స్‌‌‌‌‌‌‌‌ రిటెయిల్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో టాప్​ ప్లేస్​లో  నిలిచి 20 ఏళ్ల  జర్నీని సక్సెస్​ ఫుల్​గా  పూర్తి చేసిన తాము,   మూడవ దశాబ్దంలోనూ ఇలాగే టాప్​ ప్లేస్​లో కొనసాగుతామనే ధీమాను బాలు చౌదరి వ్యక్తం చేశారు.  2,500 మంది ఉద్యోగుల సహకారంతో  3 కోట్ల మంది వినియోగదార్లను సొంతం చేసుకున్నామని , ఉద్యోగుల సంఖ్యను  రెండేళ్లలో 4 వేలకు పెంచుతామని చెప్పారు. మొబైల్స్​తో పాటు ఇతర ఎలక్ట్రానిక్​ అప్లయెన్స్​స్​ కూడా తమ స్టోర్లలో అందుబాటులో ఉంటాయని, ఈ విస్తరణ కోసం రూ. 300 కోట్ల దాకా పెట్టుబడులు పెట్టనున్నామని కంపెనీ వెల్లడించింది. కర్నాటక, మహారాష్ట్ర, ఒడిషాలలో అడుగు పెడతామని తెలిపింది.

ఆర్గనైజ్డ్​ రిటెయిల్​ లీడర్​...

దేశంలో మొబైల్స్‌‌‌‌‌‌‌‌ రిటెయిల్​ను ఆర్గనైజ్డ్‌‌‌‌‌‌‌‌ దిశలో నడిపించిన  ఘనత తమదేనని బాలు చౌదరి పేర్కొన్నారు. 2006 నుంచి బ్రాండ్‌‌‌‌‌‌‌‌ అంబాసిడర్లను నియమించుకుంటూ ప్రత్యేకత చాటుకుంటున్నామని అన్నారు.  మొబైల్స్‌‌‌‌‌‌‌‌ను  డిస్‌‌‌‌‌‌‌‌ప్లే  చేయడం మాతోనే  మొదలయిందని,  స్టోర్​లో మొబైల్​ఫోన్​  టచ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఫీల్‌‌‌‌‌‌‌‌ను సాధ్యం చేశామని వివరించారు.  క్వాలిటీ ప్రొడక్టుల సేల్స్​తోపాటు, కస్టమర్లకు అందించే మెరుగైన సేవల వల్లే వారి మన్ననలు పొందగలుగుతున్నామని, ఈ సందర్భంగా కస్టమర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని బాలు చౌదరి చెప్పారు. టెలికం రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మొబైల్స్‌‌‌‌‌‌‌‌ మాన్యుఫాక్చరింగ్​ కంపెనీలతో  కలిసి కస్టమర్లకు లేటెస్ట్​ మోడళ్లను అందిస్తున్నామని బాలు చౌదరి తెలిపారు.  రాబోయే రోజుల్లో 5జీ కొత్త రికార్డులు నమోదు చేయనుందన్నారు. కరోనా తర్వాత మొబైల్స్‌‌‌‌‌‌‌‌ రిటెయిల్‌‌‌‌‌‌‌‌లో  ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ వాటా ఏకంగా 65 శాతానికి చేరిందని అన్నారు.