ఇండ్లు ఇవ్వాలంటూ టీడబ్ల్యూజేఎఫ్ అధ్వర్యంలో ధర్నా

ఇండ్లు ఇవ్వాలంటూ టీడబ్ల్యూజేఎఫ్ అధ్వర్యంలో ధర్నా

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా: ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్యర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ జర్నలిస్టుల ప్రతినిధులు మాట్లాడారు. జిల్లాలో చాలామంది వర్కింగ్ జర్నలిస్టులు సొంత ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అద్దె ఇండ్లల్లో ఉంటూ అద్దె కట్టలేక నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు.

జిల్లాలో పని చేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇండ్ల స్థలాలు గానీ.. డబుల్ బెడ్రూం ఇండ్లు గానీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజెఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, కమిటీ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.