జిరాక్స్ సెంటర్లో ఫేక్ సర్టిఫికెట్ల దందా

జిరాక్స్ సెంటర్లో ఫేక్ సర్టిఫికెట్ల దందా
  • పైసలిస్తే క్షణాల్లో అన్నీ రెడీ
  • ఐటీ కారిడార్​లో ఇద్దరు నిర్వాహకులు అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్​లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టైంది. ఈ కేసు వివరాలను మాదాపూర్​ఏసీపీ శ్రీధర్,​ గచ్చిబౌలి ఇన్​స్పెక్టర్​హబిబుల్లాఖాన్​కలిసి శనివారం వెల్లడించారు. హఫీజ్ పేటలోని​ ప్రేమ్​నగర్​కు చెందిన మహ్మద్ సాజీద్​(37) గచ్చిబౌలి ఇందిరానగర్​లోని ఎస్బీఐ బ్యాంక్​సమీపంలో శ్యామ్ జిరాక్స్​సెంటర్ అండ్ ఫొటో స్టూడియో నడిపిస్తున్నాడు. సూర్యాపేట జిల్లా మోతే మండలం విభాలపురానికి చెందిన గంట్ల రాజీవ్​గాంధీ(34) ఇదే జిరాక్స్​సెంటర్​లో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి ఈజీ మనీ కోసం నకిలీ సర్టిఫికెట్ల తయారీని మొదలుపెట్టారు. ఎస్ఎస్సీ మెమోల నుంచి పోలీస్​వెరిఫికేషన్ సర్టిఫికెట్, నకిలీ థెరపీ, మెడికల్​రిపోర్టులు, నకిలీ డ్రైవింగ్ లైసెన్సులు, జాబ్​ఎక్స్​పీరియన్స్ సర్టిఫికెట్లు రెడీ చేసి అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. 

వీరి దందాపై సమాచారం రావడంతో గచ్చిబౌలి, ఎస్​వోటీ పోలీసులు కలసి దాడి చేశారు. వీరి నుంచి సర్టిఫికెట్లు పొందిన కిరణ్​కుమార్, శరత్, చిరుగూరి రాజు, మురళీధర్, జెల్లా నరేశ్, పుష్పా, గౌతమ్, రజనీకాంత్, రాజేశ్ అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం మహ్మద్​సాజీద్, రాజీవ్​గాంధీని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.  ఒక కంప్యూటర్, ప్రింటర్, 30 పోలీస్​వెరిఫికేషన్​సర్టిఫికెట్లు, మూడు చొప్పున ఎస్ఎస్సీ మెమోలు, థెరపీ సర్టిఫికేట్లు, ఓ హోమ్​గార్డు ఐటీ కార్డు, బోనఫైడ్​సర్టిఫికేట్, రెండు ఇంటర్నేషనల్ డ్రైవింగ్​ లైసెన్సులు, రెండు జాబ్​ఎక్స్​పీరియన్స్​సర్టిఫికెట్లను స్వాధీనం చేసున్నారు.