తండ్రిని ఫ్లైట్ ఎక్కించి వస్తుండగా యాక్సిడెంట్..

తండ్రిని ఫ్లైట్ ఎక్కించి వస్తుండగా యాక్సిడెంట్..

మేడ్చల్ జిల్లా, వెలుగు: హైదరాబాద్​లో తండ్రిని ఫ్లైట్ ఎక్కించి ఇంటికి వెళ్తున్న అన్నదమ్ములు ఇద్దరూ రోడ్డు యాక్సిడెంట్​లో అక్కడికక్కడే మృతి చెందారు. జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలం స్తంభంపల్లికి చెందిన శేరి అనంతి కొడుకు సుదర్శన్(32). అనంతి అన్న కొడుకు రాజేందర్(37). మంగళవారం అనంతి దుబాయ్ వెళ్తుండటంతో సుదర్శన్, రాజేందర్ వాళ్ల ఫ్రెండ్​ వంశీతో కలసి తండ్రిని హైదరాబాద్​ తీసుకెళ్లి ఫ్లైట్ ఎక్కించారు. తిరుగు ప్రయాణంలో వీరి కారు శామీర్‎పేట మండలంలోని లాల్‎మలక్‎పేట్ వద్ద ఆగి ఉన్న కంటెయినర్​ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేందర్, సుదర్శన్‌‌‌‌ స్పాట్​లోనే చనిపోయారు. వంశీకి రెండు కాళ్లు విరగడంతోపాటు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్ పేట సీఐ సుధీర్ తెలిపారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.