టూవీలర్ ను ఢీ కొట్టిన కారు..తల్లీ కొడుకు మృతి

టూవీలర్ ను ఢీ కొట్టిన కారు..తల్లీ కొడుకు మృతి

హైదరాబాద్ రాగన్నగూడ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్న టాటా సఫారీ కారు… టూవీలర్ ను ఢీ కొట్టింది. దీంతో టూవీలర్ పై ఉన్న తల్లి, కొడుకు అక్కడికక్కడే చనిపోయారు. కారులో ఉన్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రికి తరలించారు. మృతులు రాగన్నగూడ లోని జీవీఆర్ కాలనీలో ఉండే ప్రదీప్ రెడ్డి, చంద్రకళ గా పోలీసులు గుర్తించారు. పోస్ట్ మార్టం కోసం డెడ్ బాడీలను ఉస్మానియాకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.