ఉప్పునుంతల/భైంసా, వెలుగు: పంటల కోసం చేసిన అప్పులు తీర్చలేక వేర్వేరు జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం దేవదారికుంట గ్రామానికి చెందిన జయరాం నాయక్(38) తనకున్న రెండెకరాలతోపాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని రెండేళ్లుగా పత్తి సాగుచేస్తున్నాడు. గతేడాది పంట దిగుబడి రాకపోవడంతో అప్పులు పేరుకుపోయాయి. ఈ ఏడాది కూడా పత్తి వేయగా చేను ఆశించిన స్థాయిలో లేదు. చేనేమో ఇలా ఉంది.. కట్టాల్సిన అప్పు రూ.5లక్షలు అయ్యిందని ఇటీవల జయరాం భార్య బుజ్జితో చెప్పి బాధపడ్డాడు. ముందురోజు పంటకు వేసేందుకు తెచ్చిన పురుగుల మందును ఆదివారం వేకువజామున తాగాడు. తర్వాత తాను మందు తాగినట్లు భార్యతో చెప్పాడు. వెంటనే ఆమె అచ్చంపేట గవర్నమెంట్హాస్పిటల్ కు తీసుకెళ్లింది. చికిత్స పొందుతూ జయరాం మృతిచెందాడు. మృతునికి భార్యతోపాటు తేజ, కార్తీక్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అలాగే నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రాంటెక్ గ్రామానికి చెందిన గణేశ్(28) తనకున్న 2 ఎకరాల్లో పత్తి, సోయా వేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అదే టైంలో ఇల్లు కొనడంతో అప్పులు రూ.5లక్షలకు చేరాయి. వాటిని తీర్చే మార్గం లేక ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లిపోయిన గణేశ్తరోడా గ్రామ శివారులో పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి నిజామాబాద్ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
- తెలంగాణం
- September 20, 2021
లేటెస్ట్
- రెండు అత్యాచారం కేసుల్లో సంచలన తీర్పులు. దోషులకు 20 ఏళ్లు జైలు
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- షర్మిలపై అవినాష్ ఫిర్యాదు.. నోటీసులు జారీ చేసిన ఈసీ..
- అయ్యోపాపం : వడదెబ్బతో తెల్ల పులి స్నేహ చనిపోయింది
- చేనేత కార్మికులకు రూ.50 కోట్ల బకాయిలు విడుదల
- గురుకులాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల
- Baak Movie: తమన్నా, రాశి ఖన్నాల బాక్ వెనక్కి వెళ్ళింది..దిల్ రాజు మూవీ కూడా!
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- చెరువుల ఆక్రమణపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..
- ఎండలతో పాటు కరెంట్ బిల్లు పెరుగుతుందా... అయితే ఇలా తగ్గించుకోండి..
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- వచ్చే వారమే తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు.. ఈ తేదీల్లో రావొచ్చు!
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..