కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లోని చిల్లివాక్ నగరంలో 2023 అక్టోబర్ 7 శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో మరణించిన భారత పైలట్లు అభయ్ గాడ్రూ, యశ్ విజయ్ రాముగాడే ముంబై నుంచి వచ్చారు.
పైపర్ పీఏ-34 సెనెకా అనే ట్విన్ ఇంజన్తో కూడిన విమానం చిల్లివాక్ నగరంలోని ఓ మోటెల్ వెనుక ఉన్న చెట్లు , పొదలపై కూలిపోయిందని కెనడా పోలీసు అధికారులు తెలిపారు.
విమాన ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. కెనడా రవాణా భద్రతా బోర్డు ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.