కెనడాలో కూలిన విమానం.. ఇండియన్ పైలట్స్ ఇద్దరు మృతి

 కెనడాలో కూలిన విమానం..  ఇండియన్  పైలట్స్ ఇద్దరు మృతి

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని చిల్లివాక్ నగరంలో 2023 అక్టోబర్  7   శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్‌లతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో మరణించిన భారత పైలట్లు  అభయ్ గాడ్రూ, యశ్ విజయ్ రాముగాడే  ముంబై నుంచి వచ్చారు. 

పైపర్ పీఏ-34 సెనెకా అనే ట్విన్ ఇంజన్‌తో కూడిన విమానం చిల్లివాక్ నగరంలోని ఓ మోటెల్ వెనుక ఉన్న చెట్లు , పొదలపై కూలిపోయిందని కెనడా పోలీసు అధికారులు తెలిపారు. 

విమాన ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు.  కెనడా రవాణా భద్రతా బోర్డు ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.