లక్నో: తమ పదవులు వదులుకుని బీజేపీలో చేరిన ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. మాజీ ఈడీ జాయింట్ డైరెక్టర్ రాజేశ్వర్ సింగ్ యూపీలోని సరోజినీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి సమాజ్ వాదీ అభ్యర్థి అభిషేక్ మిశ్రాపై విక్టరీ కొట్టారు. 1996 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన రాజేశ్వర్ సింగ్ మరో 14 ఏండ్ల సర్వీస్ ఉండగానే జేడీ పోస్టు నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. 1994 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అసిమ్ అరుణ్కూడా ఈ ఏడాది జనవరిలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఎస్పీకి కంచుకోటలా ఉన్న కన్నౌజ్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ క్యాండిడేట్గా పోటీ చేసి విజయం సాధించారు. ఎస్పీ అభ్యర్థిఅనిల్ దోహరే పై 6,090 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.