ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. నక్సల్ కమాండర్ హతం

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. నక్సల్ కమాండర్ హతం

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు న‌క్స‌ల్స్ మృతిచెందారు. గదిరాస్​ పరిధిలోని మంకపల్​ వద్ద జిల్లా రిజర్వు గార్డ్‌, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో పోలీసులు, నక్సలైట్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు నక్సల్స్ మరణించారు. చ‌నిపోయిన వారు గంధాదుర్ (మలంగీర్ ఏరియా కమిటీ కమాండర్), అయుత్ గా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలతో పాటు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో చనిపోయిన గంధాదుర్​ అనే నక్సల్ తలపై రూ.5 లక్షల నగదు రివార్డు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Two naxals killed in encounter with police in Chhattisgarh