ఓపెన్ ప్లేసులో ఉమ్మేశారని ఇద్దరి అరెస్టు

ఓపెన్ ప్లేసులో ఉమ్మేశారని ఇద్దరి అరెస్టు

జైపూర్: ఓపెన్ ప్లేసులో ఉమ్మివేసిన ఇద్దరిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. కరోనా ఎఫెక్టుతో రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించింది. భరత్​పూర్ జిల్లాలోని ఉచ్ఛెయిన్ టౌన్​లో రాజు, దినేశ్ అనే ఇద్దరిని గుట్కా నములుతూ ఓపెన్ ప్లేస్ లో ఉమ్మివేస్తుండగా పట్టుకున్నామని, ఈ మేరకు లాక్​డౌన్ రూల్స్ బ్రేక్ చేసినట్లుగా ట్రీట్​చేస్తూ వారిని అదుపులోకి తీసుకున్నామని అక్కడి పోలీసులు గురువారం మీడియాకు తెలిపారు. వారు మాస్కులు కూడా పెట్టుకోలేదని, ఎలాంటి రీజన్ లేకుండా బయట తిరుగుతున్నారని తెలిపారు. ఐపీసీ ఐపిసి సెక్షన్ 188 కింద వారిని అరెస్టు చేశామని, కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత విడుదల చేసినట్లు పోలీసులు చెప్పారు.